హైదరాబాద్లో జరిగిన ప్రైవేట్ బస్సు ఓనర్స్ సమావేశానికి తనను ఆహ్వానించకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి. ఒకప్పుడు తాము తెలంగాణ నుంచే వచ్చామని, తమను గద్వాల రాజులుగా పిలిచేవారని గుర్తు చేశారు. ప్రైవేట్ బస్సులను ప్రభుత్వానికి లీజుకు ఇచ్చినవారు ఇప్పుడు బస్సులు ఎలా నడుపుతారో చూస్తానంటూ హెచ్చరించారు. ప్రభుత్వం తన ఇష్టానుసారంగా బస్సు ఓనర్స్ సమావేశం ఏర్పాటు చేస్తే చూస్తూ ఊరుకోమని, తాను కూడా రంగంలోకి దిగాల్సి వస్తుందని జేసీ ఘాటుగా వ్యాఖ్యానించారు.
#JCPrabhakarReddy #Telangana #BusOwners #Hyderabad #Gadwal #TelanganaPolitics #AndhraPolitics #AsianetNewsTelugu #AndhraPradesh
📲 Join Our WhatsApp Channel: 👉 https://shorturl.at/TAZpS 🔗
Stay updated with the latest news at 🌐 www.telugu.asianetnews.com 🗞️